లోక్సభలో భద్రతా వైఫల్యం.. సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు
పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. లోక్సభలో విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుండి సభలోకి వచ్చారు. అందులో ఒకరు స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. విజిటర్ గ్యాలరీలో కూర్చున్న వారిలో నుంచి ఇద్దరు వ్యక్తులు హౌస్లోకి దూకి కలర్ స్మోక్ను వదిలారు. జీరో అవర్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భయాందోళనకు గురైన ఎంపీలు బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. అయితే, గందరగోళం తొలగిన కొద్దిసేపటికే లోక్ సభ మళ్లీ పున: ప్రారంభమైంది. 22ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ ఇదే రోజున ఇలాంటి ఘటన చోటుచేసుకోవటం తీవ్ర కలకలం రేపింది.
Tags :