పార్టీ పేరు మార్పుపై టీఆర్ఎస్... బహిరంగ ప్రకటన
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి గా మారుస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేరిట జారీ అయిన ఈ ప్రకటనలో పార్టీ కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పంపాలని అందులో సూచించారు. అభ్యంతరాలను 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి పేరు మార్పు, ఇతరత్రా సవరణలు ఉంటే వాటిపై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. దీనికోసం స్థానిక పత్రికలతో పాటు ఆంగ్ల పత్రికల్లోనూ సదరు పార్టీ ప్రకటనలు ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నిబంధలన మేరకు ఈసీ ప్రకటన జారీ చేసింది.
Tags :