ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పీవీకి భారతరత్న పై ఆస్ట్రేలియా లో ఘన నివాళి!

పీవీకి భారతరత్న పై ఆస్ట్రేలియా లో ఘన నివాళి!

ఆస్ట్రేలియా పర్యటనలో వున్నా బీఆర్‌ఎస్‌  ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు గా పనిచేసిన మహేష్ బిగాల ప్రవాసులతో కలిసి ఈరోజు సిడ్నీ లోని ఓం బుష్ కమ్యూనిటీ సెంటర్ పార్క్ లో సందర్శించి నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమం డిప్యూటీ మేయర్ శాండీ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమములో పెద్ద ఎత్తున ఎన్నారైలు పాల్గొన్నారు. మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాల‌ను గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వ‌హించింద‌న్నారు తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు ఆస్ట్రేలియాలో మొట్ట మొదటి విగ్రహాన్ని పెట్టిన విషయం తెలిసిందే. భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ఉత్సవాలు  చేసారని గుర్తు చేశారు.

పీవీకి భారతరత్నను సాధించే దిశగా మహేష్ బిగల అద్వ్యర్యములో ఎన్నారైలను అందరికి ఇక తాటిపై తీసుకువచ్చి ఏకంగా ఆన్ లైన్ లో ఓ పెద్ద ఉద్యమాన్నే చేసిన విషయాన్నీ గుర్తు చేసారు.సెంట్రల్ గవర్నమెంట్ కి చేంజ్.ఆర్గ్ ద్వారా ఒక పెటిషన్ సబ్మిట్ చేసారు. కొద్దిగా సమయం తీసుకున్న పీవీ గారికి గారికి ఇచ్చినందుకు ఎన్నారైలు అందరి తరపున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు మరియు ఎన్నారైలు అందరూ హర్షం వ్యక్తం చేసారు. ఈరోజు ఈ కార్యక్రమములో శాండీ రెడ్డి, కారి రెడ్డి, రాజేష్ గిరి రాపోలు, కిషోర్ బేండే, రవి దూపాటి, రాహుల్ రాంపల్లి, చిరాన్ పురంశెట్టి, రవి శంకర్ రేణుకుంట, కృష్ణ దేవతి,హేమంత్ గంగు, సునీల్, శంకర్ మిత్రులు అలాగే సీనియర్ సిటిజన్స్ నారాయణ్ రెడ్డి, నాగేశ్వర రావు, జార్జ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :