అమెరికా వర్సిటీలు ఇక నుంచి.. విద్యార్థుల టోఫెల్ స్కోర్లను
అమెరికన్ యూనివర్సిటీలు ఇక నుంచి విద్యార్థుల టోఫెల్ స్కోర్లను ధ్రువీకరించుకునే అవకావముందని టోఫెల్, జీఆర్ఈలను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ వెల్లడిరచింది. దీనికోసం దక్షిణాసియా నుంచి అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపించే కెరీర్ మొజాయిక్ సంస్థతో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల విశ్వవిద్యాలయాలకు అందే విద్యార్థుల బయేడేటాపై మరింత విశ్వసనీయత పెరుగుతుందని, వాటి ఆధారంగా మెరుగైన ఎంపిక చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. టోఫెల్ను ఎక్కువగా రాసే భారతీయ విద్యార్థులకు, అమెరికా వర్సిటీలకు తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని కెరీర్ మొజాయిక్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా జవేరీ పేర్కొన్నారు.
Tags :