అమెరికాలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం
ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లిన ఓ విద్యార్థి వాటర్ గేమ్స్ ఆడుతుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల రాజగణేష్ కుమారుడు వెంకటరమణ (27) ఉన్నత విద్య కోసం గత ఏడాది ఆగస్టు 22న అమెరికా వెళ్లాడు. ఇండియానా యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫార్మటిక్స్ కోర్సు చదువుతున్నారు. ఈ నెల 9న మిత్రులతో కలిసి వెస్ట్ఫ్లోరిడాకు వెళ్లి వాటర్ గేమ్స్ ఆడుతుండగా వేరే వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో వెంకటరమణ నీటిలో పడి మృతిచెందాడు. వెంకటరమణ మృతి విషయాన్ని భారత ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహం ఈ నెల 18 లేదా 19న భారత్కు వస్తుందని సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Tags :