కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ తమిళి సై భేటీ అయ్యారు. నార్త్బ్లాక్లోని కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో షాను కలిసిన ఆమె సుమారు 25 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గవర్నర్గా మూడేళ్లు పూర్తవడంతో హోం మంత్రి ఆశీస్సులు పొందడానికి వచ్చానన్నారు. మూడో ఏడాదికి సంబంధించి గవర్నర్గా తన కార్యాకలాపాలతో కూడిన పుస్తకాన్ని ఆయనకు అందించినట్లు తెలిపారు. ఇది సాధారణ పర్యటనేనన్నారు. అనంతరం ఢిల్లీ లోని మలయ మందిరం (శివాలయం)లో ఏర్పాటు చేసిన కార్తిక మాస పూజలో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు.
Tags :