అమెరికా అనుబంధ సంస్థల విలీనం : టెక్ మహీంద్రా
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే 2 పూర్తిస్థాయి అనుబంధ సంస్థలు బార్న్ గ్రూప్, టెక్ మహీంద్రా ( అమెరికాస్)లను విలీనం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐటీ సేవల కంపెనీ టెక్ మహీంద్రా వెల్లడించింది. వ్యాపార కార్యకలాపాలను కలపడంతో పాటు నిర్వహణ వ్యయాలు, నియంత్రణ పరమైన ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. ఈ విలీనానికి అమెరికా నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంటుంది. ఈ విలీన ప్రణాళిక 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. విలీన ప్రణాళికకు బార్న్ గ్రూప్, టెక్ మహీంద్రా ( అమెరికాస్)లు ఈ నెల 22న ఆమోదం తెలిపాయి.
Tags :