ఒంగోలు లోక్సభ టీడీపీ టికెట్ మాగుంట శ్రీనివాసులురెడ్డికే!
ఒంగోలు లోక్సభ టికెట్ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే కేటాయించాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. ఒంగోలు సీటుకు శ్రీనివాసులు రెడ్డి తోపాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ మొదట పరిశీలించింది. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసులు రెడ్డినే టీడీపీ ఖరారు చేసినట్లు సమాచారం. ఒంగోలు లోక్సభ స్థానానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని ఆయన తనయుడు రాఘవరెడ్డి ఒంగోలులో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
Tags :