శ్రీను వైట్ల ఈ సారి ప్రూవ్ చేసుకోవాల్సిందే!
ఒకప్పుడు శ్రీను వైట్ల అంటే టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లలో ఒకరు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ లను అందించిన సూపర్ హిట్ ఫిల్మ్ మేకర్గా శ్రీను వైట్ల ప్రశంసలు అందుకునే వాడు. కానీ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలయ్యాయి.
దానికి తోడు ఆయన పర్సనల్ లైఫ్ కూడా ఆయన్ని మరింత ఇబ్బంది పెడుతుంది. షూటింగ్ పూర్తైన తర్వాత కూడా రెండు మూడు సినిమాలు క్యాన్సిల్ అయిన దాఖలాలున్నాయి. దీంతో ఆయన అసలు ఇండస్ట్రీకే దూరమవుతాడా అనే డౌట్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీను వైట్ల ఇప్పుడు ఒక్క మూవీ ఛాన్స్ దక్కించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాడు.
ఒకప్పుడు సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్గా పేరొందిన శ్రీను వైట్ల.. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని లాంటి సినిమాలతో డిజాస్టర్లు అందుకున్నాడు. కొన్నాళ్ల క్రితం విష్ణు హీరోగా ఢీ సీక్వెల్గా ఢీ అండ్ ఢీ టైటిల్ లుక్ను రిలీజ్ చేశారు. సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత సినిమా ఆగిపోయింది.
తర్వాత ఓ బడా ప్రొడ్యూసర్ కొడుకుతో సినిమా స్టార్ట్ చేశాడని వార్తలొచ్చాయి కానీ అది కూడా మొదటి షెడ్యూల్ని మొదలు పెట్టకముందే ఆగిపోయింది. దీంతో శ్రీను వైట్ల ఇప్పుడు పెద్ద హీరోతో మాత్రమే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ను హీరోగా తీసుకున్నాడు. సినిమాను మాటలకు అయితే అనుకున్నారు కానీ దాన్ని ఇప్పటి వరకు పట్టాలెక్కించడం మాత్రం ఇంకా జరగలేదు. ఈ సినిమాతో అయినా శ్రీను వైట్ల సాలిడ్ హిట్ కొట్టి తనేంటో ప్రూవ్ చేసుకోవాలి.