మరోసారి వైరముత్తు పై రెచ్చిపోయిన సింగర్ చిన్మయి....
చిన్మయి శ్రీపాద సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళ ప్రేక్షకులకి సుపరిచితమైన పేరు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ, విమెన్ అవేర్నెస్ ని టార్గెట్ చేస్తుంది ఈ సింగర్. రీసెంట్ గా మీటూ మూమెంట్ లో భాగంగా తమిళ రైటర్ వైరముత్తు మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. వైరముత్తు తనని లైంగికంగా వేధించాడని తన వాయిస్ బలంగా వినిపించింది చిన్మయి.
ఇక లేటెస్ట్ గా మరోసారి వైరముత్తు మీద ఫైర్ అయ్యింది చిన్మయి. అతన్ని కలిసి అతనితో ఫోటో దిగిన యువ నటి అర్చన షేర్ చేసింది. వాటికి స్పందించిన చిన్మయి అతన్ని నమ్మవద్దు. ఒంటరిగా అతన్ని అసలు కలవద్దు అంటూ కామెంట్ పెట్టింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజారాణి సీరియల్ తో పాపులర్ అయిన అర్చన ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సందర్భంలో వైరముత్తు ని కలిసి ఫోటో దిగింది. ఈ పిక్ ని తన సోషల్ మీదకి ఖాతాలో షేర్ చేసింది.
గొప్ప రైటర్ గా పేరు తెచ్చుకున్న వైరముత్తు చిన్మయి వేధింపుల విషయంలో సైలెంట్ గా ఉంటున్నారు. చిన్మయి ఎంత గొడవ చేసినా కోలీవుడ్ సినీ ప్రముఖులు ఎవరు దీనిపై పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదు. చిన్మయి మాత్రం వైరముత్తు కనిపిస్తే చాలు అతన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంది. అప్పట్లో నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించిన మీటూ మూమెంట్ లో కొన్నాళ్ల పాటు చిన్మయి వ్యాఖ్యలు అందరిని షాక్ అయ్యేలా చేశాయి. రైటర్ వైరముత్తు లోని మరో యాంగిల్ ని పరపంచానికి చూపించింది చిన్మయి శ్రీపాద.