ఇది చెప్పేందుకు ఏ జోతిష్కుడు.. అవసరం లేదు
దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. జౌరంగాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదే కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మార్పును తప్పకుండా చూస్తారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి వీస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలనే చూడండి. ప్రజలు మార్పును కోరుకున్నారు. బీజేపీని దించి కాంగ్రెస్కు అధికారమిచ్చారు. ప్రజల మనస్తత్వం ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మార్పు తథ్యం. ఇది చెప్పేందుకు ఏ జోతిష్కుడు అవసరం లేదు అని పవర్ వ్యాఖ్యానించారు.
Tags :