ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చంద్రబాబు లాగా సానుభూతి కోసం ప్రయత్నించాల్సిన అవసరం జగన్ కు లేదు.. సజ్జల

చంద్రబాబు లాగా సానుభూతి కోసం ప్రయత్నించాల్సిన అవసరం జగన్ కు లేదు.. సజ్జల

నిన్న రాత్రి సీఎం మేము సైతం సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. రాయి చేతితో విసిరి ఉంటే అంత బలంగా తగిలే అవకాశం లేదని.. ఎయిర్ గన్ లాంటిది ఉపయోగించి ఉంటారని తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ రాయి విసిరిన వారు ఎంతో ప్లాన్ తో ఈ పని చేశారు అంటున్నారు సజ్జల. ఎందుకంటే ఆ రాయి కాస్త పక్కకు తగిలి ఉంటే జగన్ ప్రాణానికే ప్రమాదమట. పోనీ కాస్త కింద తగిలి ఉంటే పూర్తిగా కన్ను పోయేదట. ఈ విషయాలు పరిగణలోకి తీసుకుంటే ఈ పని చేసింది కేవలం ఆకతాయిలు కాదని.. పక్కా ప్లానింగ్ తో చేసిన హత్యాయత్నం అని సజ్జల ఆరోపిస్తున్నారు. అయితే మరో పక్క టిడిపి నేతలు ఇదంతా డ్రామా అని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం గురించి కూడా మాట్లాడిన సజ్జల వారు కడుపుకు అన్నం తింటున్నారా.. ఒక మనిషికి దెబ్బ తగిలితే ఇలాంటి మాటలా మాట్లాడేది అంటూ మండిపడ్డారు.అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నించారని ఈ నేపథ్యంలో గుర్తు చేసిన సజ్జల జగన్ కి అటువంటి అవసరం లేదు అని స్పష్ఠికరించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :