ASBL NSL Infratech

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత .. తొలి భారత కంపెనీగా

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత .. తొలి భారత కంపెనీగా

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. మార్కెట్‌ విలువ పరంగా తొలిసారి రూ.20 లక్షల కోట్లను దాటింది. ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి దేశీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్లు దాదాపు 14 శాతం మేర రాణించడంతో ఈ ఘనత రిలయన్స్‌ సొంతమైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు సోమవారం రూ.2,904 వద్ద ముగిసింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 11.16 గంటలకు 1.8శాతం మేర లాభంతో రూ.2,953 వద్ద ట్రేడయ్యింది. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్‌ విలువ రూ.20 లక్షల కోట్లు దాటింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :