రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత .. తొలి భారత కంపెనీగా
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. మార్కెట్ విలువ పరంగా తొలిసారి రూ.20 లక్షల కోట్లను దాటింది. ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి దేశీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్లు దాదాపు 14 శాతం మేర రాణించడంతో ఈ ఘనత రిలయన్స్ సొంతమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సోమవారం రూ.2,904 వద్ద ముగిసింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో 11.16 గంటలకు 1.8శాతం మేర లాభంతో రూ.2,953 వద్ద ట్రేడయ్యింది. ఈ క్రమంలోనే కంపెనీ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్లు దాటింది.
Tags :