యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు రాజేంద్రస్కృతి పురస్కారం
తెలుగు, హిందీ రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ను రాజేంద్రస్కృతి జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నాంది సేవా ట్రస్ట్ వెల్లడించింది. ఈ నెల 26న వారణాశిలో నిర్వహించే ప్రత్యేక వార్షిక సమ్మేళనంలో యార్లగడ్డకు రూ.లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేయనున్నామని ట్రస్ట్ నిర్వాహకురాలు శశికళా పాండే తెలిపారు. తెలుగు సాహిత్యంపై యార్లగడ్డ కీలక ప్రసంగం చేస్తారని ఆమె పేర్కొన్నారు.
Tags :