ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అవిశ్వాసం తమకు ఎప్పటికీ అదృష్టమే : మోదీ

అవిశ్వాసం తమకు ఎప్పటికీ అదృష్టమే : మోదీ

విపక్షాలు కేంద్రంపై పదే పదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని  ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని చురకలంటించారు. ప్రతిపక్షాలకు ఆ భగవంతుడే అవిశ్వాసం పెట్టమని చెప్పి ఉంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల కూటమి ఇండియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. దీనిపై ప్రధానమంత్రి మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాసం తమకు ఎప్పటికీ అదృష్టమేనని అన్నారు. మేం మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని విపక్షాలు  నిర్ణయించాయి. అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాని అని అన్నారు. తమపై నమ్మకం ఉంచిన కోట్లాది భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజ ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :