ప్రపంచమంతా వారి కోసం ప్రార్థించాలి : మమత
బీజేపీ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఝడ్గ్రామ్ పర్యటనలో ఉన్న ఆమె క్విట్ ఇండియా వార్షికోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మణిపూర్లో ఆదీవాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా వారి ఆక్రందనలను వినే వారే లేరు. ప్రపంచమంతా వారి కోసం ప్రార్థించాలి అని పేర్కొన్నారు. దేశంలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. క్విట్ ఇండియా రోజున మనమంతా బీజేపీ క్విట్ ఇండియా అనే లక్ష్యంతో ముందుకెళ్లాలి అని మమత పిలుపునిచ్చారు.
Tags :