ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. 26న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 29 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. కొన్ని చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు.
Tags :