న్యూయార్క్ సిటీలో ఐజీ రమేష్ మారథాన్
ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ సిటీ మారథాన్ను ఐజీ(పీఅండ్ఎల్) మస్తిపురం రమేష్ పూర్తి చేశారు. 26.2 మైళ్ల మారథాన్ను 52 ఏళ్ల వయస్సులో రమేష్ పూర్తి చేయగా, ఈ సారి నిర్వహించిన మారథాన్ 52వ సంవత్సరం కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన నామినేషన్స్ను నిర్వహకులు పరిశీలించి గత ఫిబ్రవరిలో లాటరీ పద్ధతిలో మొత్తం 52వేల మందిని మారథాన్కు ఎంపిక చేశారు. మారథాన్కు ఎంపికైన వారికి గత జూలైలో శిక్షణ ఇచ్చారు. న్యూయార్క్ సిటీ మారథాన్ పూర్తి చేయడం ఆనందంగా ఉందని రమేష్ తెలిపారు. గత ఏడాది జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన ట్రియథ్లాన్లోనూ పాల్గొన్నానని తెలిపారు. స్వతహాగా క్రీడాకారుడైన డీజీపీ అంజనీ కుమార్ సహకారంతో తాను మారథాన్లో పాల్గొన్నట్లు రమేష్ రెడ్డి తెలిపారు.
Tags :