ఈవీఎంలు, వీవీ ప్యాట్ల కు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్..
రాబోయే ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. జరగబోయే ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగానికి అనుమతి జారీ ఆంధ్ర తో పాటుగా నాలుగు రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికల లో ఈవీఎంల వినియోగానికి అనుమతించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 61 ఎ సెక్షన్ కింద ఓటింగ్ మెషిన్ల వాడకానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల డిజైన్లను ఆమోదించినట్టు ఈసీ పేర్కొంది. మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా.. మిగిలిన రాష్ట్రాలలో ఏప్రిల్ 19న మొదటి విడత పోలింగ్ ప్రారంభం కాక జూన్ 1కి ఏడవ విడత ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.