మంత్రి కేటీఆర్కు కజకిస్తాన్ ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కజకిస్తాన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. కజకిస్తాన్ వేదికగా జరిగే 2022 డిజటల్ బ్రిడ్జి ఫోరమ్ సదస్సుకు రావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో బ్రిడ్జి ఫోరమ్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జి ఫోరమ్ సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని కేటీఆర్కు ఆహ్వానం అందింది. బిగ్డేటా, క్లౌడ్ సొల్యూషన్స్, డిజిటల్ సేవలపై సదస్సు నిర్వహించనున్నారు.
Tags :