ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన... ఇకపై అప్రమత్తంగా

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన... ఇకపై అప్రమత్తంగా

ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. చైనా, జపాన్‌, అమెరికా సహా పలు దేశాల్లో ఈ మహమ్మారి పరిస్థితులపై  అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై కరోనా పరిస్థితులను చర్చించి చర్యలు తీసుకొనేందుకు ప్రతివారం ఈ ఉన్నత స్థాయి కమిటీ భేటీ కావాలని నిర్ణయించారు.  ప్రపంచ దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రమంత్రి ఆదేశించారు. కరోనా ఇంకా ముగిసిపోలేదు. అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :