అయోధ్య రామయ్యకు అరుదైన కానుక!
గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి అయోధ్య రాముడికి 5వేల అమెరికన్ వజ్రాలతో కంఠహారం తయారు చేయించారు. రామాయణంలోని ముఖ్య పాత్రలను కళాకారులు ఈ హారంపై తీర్చిదిద్దారు. అయోధ్య రామమందిర ప్రారంభం సందర్భంగా ఈ హారాన్ని రాముడికి కానుకగా ఇవ్వా లనుకుంటున్నట్లు వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా తెలిపారు. 5వేల అమెరికన్ వజ్రాలను, 2 కిలోల వెండిని ఉపయోగించి 40 మంది కళాకారులు 35 రోజులు శ్రమించి ఈ హారాన్ని తయారు చేశారు. నెక్లెస్పై అయోధ్య రామమందిర నమూనాతో పాటు రామాయణంలోని ముఖ్య పాత్రలను మలిచారు.
Tags :