బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్..
27 ఏప్రిల్, 2001 న ఉద్భవించిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పటి భారత రాష్ట్ర సమితి.. ఆవిర్భావ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జీవితంలో ఎదురయ్య ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలను అధిగమిస్తూ తమ పార్టీ ఇప్పటికీ పరవాళ్ళు తొక్కుతోందని పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో సాహసంగా పోరాడిన దళపతి.. కేసీఆర్ అని ఆయన అన్నారు. లాఠీలకు, జైళ్లకు భయపడకుండా నాడు తెలంగాణ కోసం పోరాడిన గులాబీ సైనికుల త్యాగనిరతికి బీఆర్ఎస్ పార్టీ నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. ఈనాడు రెపరెపలాడుతున్న గులాబీ పతాకం తెలంగాణ కోసం ఎగురు వేసిన జయ కేతనం.. పరాయి పాలన చర విడిపించిన ఉద్యమ జెండా అని.. కేటిఆర్ అన్నారు. ఈ పార్టీ పుట్టుకే ఒక సంచలనం అని చెప్పిన కేటీఆర్ ఈనాటి వరకు ఎప్పుడు రాజీపడింది లేదని పేర్కొన్నారు. తమ పార్టీ ప్రయాణంలో కార్యకర్తల పాత్ర గురించి కూడా ఆయన ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. జెండా మోస్తూ.. జంగ్ చేస్తూ.. పార్టీ బలం, బలగంగా మారిన లక్షలాది కార్యకర్తలే పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్నారు అని అన్నారు. ఎంతో ఎమోషనల్ గా ఉన్న కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.