పవన్ కళ్యాణ్ ను ముంచేది తెలుగుదేశం పార్టీ నే.. కొడాలి వైరల్ స్టేట్మెంట్..
అభిమానులు అప్రమత్తంగా ఉండకపోతే.. పవన్ కళ్యాణ్ దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాడు. అని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ను రక్షించుకోవలసిన అవసరం అతని వెనక నడిచే జనసైనికులకు.. అతని అభిమానులకు ఉందని ఆయన తెలిపారు.. లేకపోతే నమ్మిన వారి చేతిలోనే పవన్ కళ్యాణ్ మోసపోయా అవకాశం ఉంది అని నాని అన్నారు. ఎప్పటికైనా పవన్ ని ఓడించేది వైసిపి కాదని టిడిపి నే అని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
చంద్రబాబుకి కేవలం ఓట్లు కావాలి..అంతేకానీ సీట్లు మాత్రం ఎవరికీ ఇవ్వరు. మా పార్టీ ఏ నియోజకవర్గాన్ని పర్టికులర్గా టార్గెట్ చేయలేదు. మాకు కావాల్సింది మొత్తం 175 స్థానాలలో గెలవడం..అదే మా లక్ష్యం. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం పవన్ ఓడిపోవడం అంటూ జరిగితే అది కేవలం నమ్ముకున్న టిడిపి పార్టీ చేతుల్లోనే. ఈ విషయం ఎన్నికల తర్వాత అందరికీ స్పష్టంగా తెలుస్తుంది.. అని కొడాలి నాని అన్నారు.
అంతేకాదు చంద్రబాబు నాదెండ్ల ఈ ఇద్దరు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ లాంటివారు .మరి అలాంటి వారిని పక్కన పెట్టుకు తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ను జనసైనికులే కాపాడుకోవాలి. ప్రస్తుతం జనసేనకు కేటాయించిన ఆ సీట్ల విషయంలోని టిడిపి చూపించే సవతి తల్లి ప్రేమ స్పష్టంగా అర్థం అవుతుంది. జనసేనకు ఇచ్చిన సీట్లలో కూడా ఖచ్చితంగా 10 సీట్లు ఓడిపోయేవి అని కొడాలి నాని కచ్చితంగా తేల్చి చెప్పారు. ఇలాంటి సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు ఒప్పినా..తీసుకోవడానికి పవన్ కి ఎలా మనసు ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు.. అని కొడాలి నాని అన్నారు.
ఈ నేపథ్యంలో సచివాలయాన్ని కూడా తమ ప్రభుత్వం తాకట్టు పెట్టింది అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈనాడు రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంటే అందులో రెండున్నర లక్షకు పైగా చంద్రబాబు నేతృత్వంలో జరిగినవే అని కొడాలి నాని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు తాను పరిపాలించినంత కాలం అప్పులు చేశారా అని ఈ నేపథ్యంగా కొడాలి నాని ప్రశ్నించారు.