అసలైన ఆట ఇప్పుడే మొదలైంది : కిషన్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నైతిక విజయం సాధించిందని, బీజేపీ గెలిచి ఓడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నెల్లూరు పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు. అసలైన ఆట ఇప్పుడు మొదలైందని వ్యాఖ్యానించారు. ప్రలోభాలు, బెదిరింపులతో మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిందని వ్యాఖ్యానించారు. అక్కడ డిపాజిట్ కూడా రాని పరిస్థితి నుంచి రెండో స్థానానికి బీజేపీ వచ్చిందన్నారు. ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పనిచేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలనను అంతం చేస్తామని, బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Tags :