ASBL NSL Infratech

చిరంజీవికి కేంద్రం ఆహ్వానం! ప్రధాని భీమవరం పర్యటనలో పాల్గొనాలని వినతి!! లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!!!

చిరంజీవికి కేంద్రం ఆహ్వానం! ప్రధాని భీమవరం పర్యటనలో పాల్గొనాలని వినతి!! లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!!!

ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రధాని మోదీ భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనాలని మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం ఆహ్వానం పంపింది. ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో భాగస్వాములు కావాలని కోరింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి లేఖ రాశారు. గతంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేసిన చిరంజీవికి ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. భీమవరంలో జూలై 4న నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననుండగా.. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని చిరంజీవిని కిషన్ రెడ్డి లేఖ ద్వారా కోరారు. ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను భీమవరంలో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏడాదిపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చిరంజీవికి రాసిన లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి.. తదనంతర పరిస్థితుల్లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగానూ ఆయన పని చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయాక కూడా చిరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాలను వదిలేస్తున్నానని.. ఇకపై సినిమాలపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతానని చిరంజీవి గతంలోనే తెలిపారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ.. మరో తమ్ముడు నాగబాబు ఆ పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నప్పటికీ చిరంజీవి మాత్రం రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌తోనూ ఆయన సన్నిహిత సంబంధాలను నెరుపుతున్నారు.

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఆయన చొరవ తీసుకొని మరీ వెళ్లి జగన్‌ను కలిశారు. ఇదిలా ఉండగా.. ఏపీ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తోన్న బీజేపీ గతంలో చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించిందనే ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి మాత్రం తనకు రాజకీయాలు సరిపడవనే కారణంతో దూరంగా ఉన్నారని కూడా టాక్ వచ్చింది. చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న నేత పార్టీలో చేరితే అది తమకు ఎంతగానో ఉపయోగడపడుతుందని బీజేపీ ఇప్పటికీ భావిస్తోంది. మరోవైపు ఆయన సోదరుడి పార్టీ అయిన జనసేన.. బీజేపీకి మిత్రపక్షం. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనాలని మెగాస్టార్‌కు కేంద్ర మంత్రి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోాదీ భీమవరం కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనే అవకాశం ఉంది. అదే సమయంలో తాను మోదీ పర్యటనలో భాగం కావడానికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని మెగాస్టార్ సంకేతాలు ఇచ్చే ఛాన్స్ ఉంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :