వారి హృదయాలు కలవలేదు.. కానీ పార్టీలు మాత్రం
అవిశ్వాసంపై జరిగిన చర్చలో భాగంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రతిపక్షాల కూటమిని ఎద్దేవా చేశారు. తమ కూటమిపై విశ్వాసం లేక వారు అవిశ్వాసం తీసుకువచ్చారన్నారు. వారి హృదయాలు కలవలేదు, కానీ వారి పార్టీలు మాత్రం ఏకమయ్యాయని వ్యాఖ్యానించారు. వారు మణిపుర్ కోసం ఈ అవిశ్వాస తీర్మానం తీసుకురాలేదు. ఆ పేరుతో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి వారు చేసిన ప్రయత్నమది. ప్రధాని మోదీ మణిపుర్ అంశంపై పార్లమెంట్ బయట ఒక ప్రకటన చేశారు. కానీ ఆయన పార్లమెంట్లోనే మాట్లాడాలని వారు పట్టుబడి కుర్చున్నారు అని సింధియా విమర్శించారు. అలాగే ప్రతిపక్షాల కూటమిలోని నేతల అవినీతిని సభావేదికగా ప్రస్తావించారు. ఇప్పటికే ఈ దేశ ప్రజలు వారిని బయటకు పంపించారు. ఇప్పుడు వారు పార్లమెంట్ను కూడా వీడుతున్నారు అని ఎద్దేవా చేశారు.
Tags :