ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు ట్రంపే : బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు మరీ వృద్ధుడు, మానసికంగా అసమర్థుడు. రెండో వ్యక్తి నేను అని అమెరికా అధ్యక్షుడు, డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వ్యాఖ్యానించారు. గ్రిడిరాన్ క్లబ్ అండ్ పౌండేషన్ ఏటా నిర్వహించే డిన్నర్కు బైడెన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు ట్రంపేనని వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల ఆయన సానుకూలంగా ఉంటారని విమర్శించారు. మనం ప్రజాస్వామ్యంలోని అసాధారణ పరిస్థితుల్లో జీవిస్తున్నాం. గతంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ దాడులకు గురుయ్యాయి. నాకంటే ముందు పని చేసిన అధ్యక్షుడు పుతిన్కు మోకరిల్లారు. ఏది కావాలంటే అది చేసుకోవాలని స్వేచ్చ ఇచ్చారు అని బైడెన్ ధ్వజమెత్తారు.
Tags :