ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ రీరిలీజ్
ఎన్టీఆర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది సింహాద్రి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన రెండో సినిమా కావడం దీనికి బాగా కలిసొచ్చింది. హై ఓల్టేజ్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో రికార్డ్ రేంజ్ లో కలెక్షన్లను కురిపించింది. ఎన్టీఆర్ కు ఈ సినిమాతోనే కమర్షియల్ హీరో ఇమేజ్ వచ్చింది.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ అసలు వెనక్కి తిరిగి చూసుకునే పని రాలేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాడు. అయితే అసలు విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్లో పాత సినిమాలను రీరిలీజ్ చేయడం ట్రెండ్ అవుతుంది. పోకిరి సినిమాతో ఈ ట్రెండ్కి స్వాగతం పలికారు. వీటికి కలెక్షన్స్ కూడా బాగా వస్తుండటంతో ఈ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్, మహేష్ సినిమాలు రిలీజ్ చేసి వాటికి మంచి కలెక్షన్లను రాబట్టారు.
ఈ కలెక్షన్ల ద్వారా వచ్చే డబ్బులను సోషల్ యాక్టివిటీస్ కోసం ఉపయోగిస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే రీసెంట్గా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆరెంజ్ మూవీని రీరిలీజ్ చేశారు. ఈ సినిమా చరణ్ కెరీర్లోనే డిజాస్టర్గా నిలిచిన మూవీ. అలాంటి ఈ సినిమా మొన్న రీరిలీజ్ చేసినప్పుడు మంచి కలెక్షన్లను రాబట్టింది.
ఏప్రిల్ 6న బన్నీ బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ దేశముదురును రీరిలీజ్ చేయబోతున్నారు. ఇది కాకుండా ఎన్టీఆర్ కెరీర్ లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సింహాద్రి మూవీని కూడా తిరిగి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీల్స్ లో తెరకెక్కించిన ఈ సినిమాను ప్రస్తుతం డిజిటలైజ్ చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అది అయిన తర్వాత 4కె లోకి మార్చేసి రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్డే ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా రీరిలీజ్ తో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.