భారత్ మరో అరుదైన రికార్డుకు చేరువలో
కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చి కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతోన్న బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా, ఇప్పటి వరకు 191.96 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. త్వరలోనే 200 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోనుంది. కరోనా మహమ్మారి కట్టడిలోనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,044 మంది వైరస్తో బాధపడుతుండగా, క్రియాశీల కేసుల రేటు 0.03 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 5.24 లక్షల మందిని మహమ్మారి బలి తీసుకుంది.
Tags :