ASBL NSL Infratech

భారత దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి

భారత దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి

భారత రక్షణ రంగ ఎగుమతులు దేశ చరిత్రలోనే తొలిసారిగా రూ.21వేల కోట్ల మార్కుని దాటేశాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.21,083 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (రూ.15,920 కోట్లు)తో పోలిస్తే ఇది 32.5 శాతం అధికం కావడం విశేషం. 2013-24 ఆర్థిక సంవత్సరం నుంచి పరిశీలిస్తే ఈ దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఎగుమతులు 31 రెట్ల వృద్ధిని సాధించాయి. రక్షణ రంగ ఎగుమతుల్లో గణనీయ పెరుగుదల పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. భారత రక్షణ రంగ ఎగుమతులు గొప్ప వృద్ధిని నమోదు చేశాయి. స్వతంత్య్ర భారత చరిత్రలో తొలిసారిగా రూ.21 వేల కోట్ల మార్కును దాటాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని రాజ్‌నాథ్‌ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :