అయిదు నెలల్లో ఇదే తొలిసారి... భారీస్థాయిలో
దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,435 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 15 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో యాక్టివ్ కేసులు సంఖ్య 23,091 కు చేరుకుంది. గత అయిదు నెలల్లో (163 రోజులు) ఇంత భారీస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. తాజా కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 4,41,79,712 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో రికవరి రేటు 98.47 కాగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
Tags :