ASBL NSL Infratech

కరోనా కలవరం.. దేశంలో విజృంభిస్తున్న మహమ్మారి

కరోనా కలవరం.. దేశంలో విజృంభిస్తున్న మహమ్మారి

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తాజాగా హెల్త్‌ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 59,118 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,18,46,652కి చేరుకుంది. రోజువారీ కేసుల విషయంలో గతేడాది అక్టోబర్‌ మధ్యనాటి పరిస్థితి నెలకొని ఉంది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 257 మంది మృతి చెందగా, ఇప్పటి వరకూ మొత్తంగా 1,60,949 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,21,066 యాక్టీవ్‌ కేసులుండగా 1,12,64,637 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు దేశంలో రెండు దశల్లో భాగంగా కరోనా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 25న కేంద్రం 23,58,731 టీకా డోసులను పంపిణీ చేసింది. ఇప్పటి వరకు 5,55,04,440 మందికి టీకాలు అందించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :