టీ 20 వరల్డ్ కప్ ఇండియా జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. ఈ సారి టీ20 ప్రపంచకప్నకు యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడుతుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీ కొట్టనుంది. గ్రూప్ ఏలో ఉన్న భారత్-పాక్ జట్లు న్యూయార్క్ వేదికగా జూన్ 9న తలపడనున్నాయి. ఈ సిరీస్లో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. అమెరికాలో 3, వెస్టిండిస్లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది.
భారత్ జట్టు ఇదే...
రోహిత్ శర్మ ( కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ ( వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్. రిజర్వ్ ఆటగాళ్లు : శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.