ASBL NSL Infratech

కూటమికి ఈ ఎన్నికల ఫలితాల్లో.. భారీ ఎదురుదెబ్బ : మోదీ

కూటమికి ఈ ఎన్నికల ఫలితాల్లో.. భారీ ఎదురుదెబ్బ : మోదీ

అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, సనాతన  వ్యతిరేక ఆలోచనా విధానం కలిగిన విపక్షాల కూటమికి, ఈ ఎన్నికల ఫలితాల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌లపై పరోక్షంగా విరుచుకుపడిన ఆయన సంపన్న కుటుంబాల్లో జన్మించిన వారికి సామాన్యుల కష్టాలు తెలియవన్నారు. తనకు వారసులు ఎవరూ లేరని, దేశ  ప్రజలంతా తన వారసులేనన్నారు. బిహార్‌లోని తూర్పు చంపారన్‌, మహారాజ్‌ గంజ్‌లలో నిర్వహించిన ఎన్కిల ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ, విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, తుక్డే`తుక్డే గ్యాంగులకు ప్రాతినిధ్యం వహిస్తోన్న విపక్షాల కూటమి పాపాలతో దేశం ముందుకుసాగదు. సనాతన ధర్మాన్ని దూషించే వికృత మనస్తత్వం వారిది. రానున్న రెండు దశలు, ఆ తర్వాత తుది ఫలితాల్లో వారికి భంగపాటు తప్పదు.  అణగారిన వర్గాల రిజర్వేషన్లను లాక్కొని, ఓ వర్గం వారికి కేటాయించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కాంగ్రెస్‌ కోరుకుంటోంది. అంబేడ్కర్‌ లేకుంటే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను నెహ్రూ కల్పించేవారు కాదు అని మోదీ పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :