ఐఐఎం ఇందౌర్ విద్యార్థికి రూ. కోటి వేతనం
ఇందౌర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెనేజ్మెంట్(ఐఐఎం) విద్యార్థికి ఇ-కామర్స్ కంపెనీ రూ.కోటి వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. ఐఐఎం-1లో ఈ సెషన్ చివరి ప్లేస్మెంట్ రౌండ్లో అందించిన అత్యధిక వార్షిక వేతనం ఇదేనని ఓ అధికారి తెలిపారు. దేశీయ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఈ ఉద్యోగం వచ్చినట్లు వివరించారు. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (పీజీపీ), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగాం ఇన్ మెనేజ్మెంట్ (ఐపీఎం) పూర్తి చేసిన 594 మంది విద్యార్థులకు 150కి పైగా రిక్రూటర్లు జాబ్ ఆఫర్లు అందించడంలో ఈ సీజన్ ముగిసిందని వెల్లడిరచారు.
Tags :