బాలయ్య సభలకు భారీ ఎత్తున అభిమానులు..
టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచారు. నిన్న ఎమ్మిగనూరు సభలో పాల్గొన్న బాలకృష్ణ రాయలసీమకు తాగునీరు సాగునీరు అందించిన అభినవ భగీరధులు చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబు మహిళలో ఆర్థిక విప్లవం తెచ్చారని.. రాష్ట్రంలో సుపరిపాలన నెలకొల్పింది చంద్రబాబు అని పేర్కొన్నారు. 10 లక్షల కోట్లు అప్పులు చేసి అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం నెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి తమ ఓటమికి గెలుపు కచ్చితం అన్న ధీమా బాలయ్య మాటల్లో కనిపిస్తుంది. ప్రస్తుత ఆయన రాయలసీమలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాయలసీమలో బాలయ్య కు ఫాలోయింగ్ కూడా ఎక్కువ కావడంతో ప్రచారానికి జనాలు భారీ ఎత్తున హాజరవుతున్నారు.
Tags :