ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇక లేరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థికమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రోశయ్య సన్నిహితంగా ఉండేవారు. వైఎస్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. వైఎస్ మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్గానూ సేవలందరించారు.
రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు, శాఖ, రవాణా శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు.