త్వరలో ఎక్స్ మెయిల్!
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చిన దాని నూతన యజమాని, కుబేరుడు ఎలాన్ మస్క్ అదే పేరుతో ఒక ఈమెయిల్ను తీసుకురానున్నారు. ఎక్స్ మెయిల్ త్వరలో రాబోతోందని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈమెయిల్ సేవల ముఖచిత్రం మారబోతోందని వ్యాఖ్యానించారు. అయితే సొంత ఎక్స్ మెయిల్ను ఎప్పుడు ప్రారంభిస్తారు. అందులోని ప్రత్యేకతలు ఏంటి అనే వివరాలను ఇంకా వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు నెటిజన్లు అందరూ వాడే గూగుల్ వారి జీమెయిల్ త్వరలో తన సేవలను నిలిపివేయనుందున పుకార్ల నడుమ ఎక్స్ మెయిల్ అరంగేట్రం చేయనుండటం గమనార్హం.
Tags :