కొడుకుని చూసి ఎమోషనల్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..
ఢిల్లీ లిక్కర్ కేసు విషయంలో ఈడి కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన కొడుకు ను కలిసినప్పుడు భావోద్వేగానికి గురి అయ్యారు. కస్టడీలో ఉన్న కవితను కలవడానికి అనుమతి తీసుకున్న కవిత కుటుంబం నిన్న రాత్రి ఆమెను కలుసుకున్నారు. ప్రతిరోజు గంటసేపు కుటుంబ సభ్యులను కలిసే విధంగా కోర్టు ఆమెకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆమె కొడుకును చూసిన కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిని చూసి ఆర్య కూడా ఎంతో తల్లడించాడు. ఈరోజుతో కవిత కేసు విషయంలో కోర్టు నుంచి ఈడీ తీసుకున్న కస్టడీ గడువు ముగుస్తుంది. అయితే మరింత సమగ్ర విచారణ కోసం మరొక వారం రోజుల పాటు ఆమెను కస్టడీలో ఉంచుకునే వసతి కల్పించాల్సిందిగా ఈడి కోర్టుకు మనవి చేసుకోబోతోంది అని టాక్. అయితే కవితను కలిసిన ఆమె న్యాయవాది మోహిత్ రావు కవిత కోర్టు తీర్పు పై విశ్వాసం ఉందని వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే ఈసారి కవితకు ఈడి కస్టడీ ఇస్తారా? లేదా? అన్న విషయం సాయంత్రం లోపు తెలిసిపోతుంది.