ప్రముఖ మీడియాపై ట్రంప్ పరువునష్టం దావా
ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువునష్టం దావా వేశారు. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించినందుకు గాను 475 మిలియన్ డాలర్లకు ఆయన దావా వేశారు. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో లా సూట్ ఫైల్ చేశారు. 20024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తాననే భయంతో తనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని తన దావాలో ట్రంప్ పేర్కొన్నారు. రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకు పాఠకుల మదిలో తనపై చెడు అభిప్రాయాలు నెలకొనేలా కథనాలు ప్రచురిస్తోందని ఆయన ఆరోపించారు. తనను జాత్యహంకారిగా, రష్యాకు బానిసగా, హిట్లర్గా, తిరుగుబాటుదారుడిగా తప్పుడు కథనాలతో పాఠకులకు చూపిస్తోందని ఆయన తెలిపారు.
Tags :