మరో ఘనత సాధించిన పుష్ప2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప2 కోసం యావత్ భారత దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తుంది. ఈ సినిమాకు తెలుగుతో సమానంగా హిందీలో కూడా మంచి బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పుష్ప2కు బిజినెస్ డీల్స్ కూడా క్రేజీగా జరుగుతున్నాయి. ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం, ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ కనీసం రూ.100 కోట్ల పైగా టేబుల్ ప్రాఫిట్ అందుకోబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే పుష్ప2 సినిమా బెంగాలీ భాషలో డబ్బింగ్ కాబోతున్న మొదటి ప్యాన్ ఇండియా సినిమా కావడం విశేషం. గతంలో కొన్ని డబ్బింగ్ అయినప్పటికీ సమాంతర రిలీజ్ మాత్రం ఎవరికీ వీలు పడలేదు. కానీ పుష్ప2 అలా కాదు. ఆగస్ట్ 15న ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ డబ్బింగ్ వెర్షన్స్ కోసం స్పెషల్ గా రెండు నెలల సమయాన్ని ఖర్చు పెట్టాడట.
సింగర్స్ ను సెలెక్ట్ చేసుకోవడం దగ్గర్నుంచి లిరిక్ రైటర్లతో కూర్చుని తనకు కావాల్సిన లిరిక్స్ రాయించుకుని రికార్డింగ్ చేసే వరకు అన్నీ దేవీనే దగ్గరుండి మరీ చూసుకున్నాడట. దీన్ని బట్టి పుష్ప2 కోసం ప్రతి ఒక్కరూ ఎంతగా కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15 రిలీజ్ డేట్ టార్గెట్ ను మిస్ కాకూడదనే నేపథ్యంలో సుకుమార్ సినిమా షూటింగ్ను వేగవంతం చేశాడు.