మెగా మూవీ కోసం హరీష్ నెక్ట్స్ లెవెల్ ప్లాన్
హరీష్ శంకర్ ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లవుతున్నా తను తీసింది మాత్రం ఏడు సినిమాలే. కానీ ఆడియన్స్ లో మాత్రం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు హరీష్. తన సినిమాల్లో హీరో మాస్ స్టామినాను ఆడియన్స్ విజిల్స్ వేసేలా చూపించడంలో హరీష్ దిట్ట. హరీష్ నుంచి చివరగా సినిమా వచ్చింది 2019లో. వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమా చేసి హిట్ కొట్టాడు.
ఆ తర్వాత పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు కానీ దాన్ని ఇంకా పూర్తి చేయలేకపోయాడు. ఆ సినిమా మళ్లీ తిరిగి సెట్స్ పైకి వెళ్లేది వచ్చే ఏడాదిలోనే. ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండటమెందుకని రవితేజతో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు హరీష్. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న మిస్టర్ బచ్చన్ ఈ ఇయర్ సెకండాఫ్ లో రిలీజ్ కానుంది.
అయితే పవన్ తో మళ్లీ సెట్స్ పైకి వెళ్లేలోపు మెగాస్టార్ చిరూతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు హరీష్ శంకర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ లో ఉండేలా హరీష్ ప్లాన్ చేస్తున్నాడట. మిస్టర్ బచ్చన్ షూటింగ్ పూర్తవగానే హరీష్, చిరూ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ అవాలని చూస్తున్నాడట. ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పి చిరూను ఇంప్రెస్ చేసిన హరీష్, మెగా బాస్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.