రాఖీభాయ్ క్యారెక్టర్ను తప్పు పట్టిన యంగ్ డైరెక్టర్
కెజిఎఫ్ సినిమా గురించి, రిలీజైన టైమ్లో ఏకంగా ఆర్ఆర్ఆర్ని మించి కలెక్షన్లు తెచ్చుకోవడం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చాలా పరిమితంగా ఉండే శాండల్వుడ్ మార్కెట్ని ఇంటర్నేషనల్ లెవల్కి తీసుకెళ్లిన బ్లాక్బస్టర్ ఇది. ఈ సినిమా ఇన్సిపిరేషన్తో కన్నడలో చాలా సినిమాలు హీరోల మార్కెట్తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్తో రూపొందుతున్నాయి.
అలాంటి కెజిఎఫ్లో రాఖీ భాయ్ క్యారెక్టరైజేషన్ గురించి బయట ఎక్కడ ఎవరూ నెగిటివ్గా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా వివాదాస్పద కామెంట్లు చేశాడు. రీసెంట్గా ఈయనతో పాటు ఇంద్రగంటి, నందిని రెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందు ఇన్డైరెక్ట్గా రాఖీ భాయ్ క్యారెక్టర్ గురించి మాట్లాడిన వెంకటేష్, ఆ తర్వాత నేరుగా పాయింట్లోకి వెళ్లిపోయాడు.
అమ్మ చెప్పిందని పెద్ద మొత్తంలో బంగారం దోచేసిన హీరో తర్వాత దాన్ని ఎవరికీ పంచకుండా తనతో ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు మాత్రమే ఇవ్వడం ఎంతవరకు న్యాయమని రెచ్చిపోతూ మాట్లాడాడు. వాస్తవానికి కెజిఎఫ్ లోపాలు లేని సినిమా కాదు కానీ 1200 కోట్లు వసూళ్లు తెచ్చిన బ్లాక్ బస్టర్. సినిమా అంతలా హిట్ అయిందంటే యునానిమస్గా ఆడియన్స్ ఆ మూవీని యాక్సెప్ట్ చేసినట్లే.
అలాంటప్పుడు అదే పనిగా రాఖీ భాయ్ క్యారెక్టర్ గురించి ఎత్తి చూపడం వల్ల అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఛాన్సులు ఎక్కువ. వెంకటేష్ చేసిన ఆ కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ మహా ఇప్పటిదాకా చేసిందే ఒక స్ట్రెయింట్ మూవీ కేరాఫ్ కంచరపాలెం. గొప్పగా పేరు కూడా తెచ్చిపెట్టింది. రెండోది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సీన్ టు సీన్ రీమేక్ చేసిన మలయాళం సినిమా. కెరీర్ లో ఇంకా ఎదుగుతున్న టైమ్లో ప్రభాస్, జూ.ఎన్టీఆర్ లాంటి స్టార్లతో వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు చేస్తున్న ప్రశాంత్ నీల్ టేకింగ్ గురించి ఇలా రియాక్ట్ అవడం కరెక్ట్ కాదని అందరూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.