ఢిల్లీ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమం.. వాట్సాప్ ద్వారా
ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వాట్సాప్ ద్వారా బస్ టికెట్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రయాణికులకు శుభవార్త చెబుతామని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే వాట్సాప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్ల సంఖ్య పరిమితి ఉంటుంది. వాట్సాప్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ను రద్దు చేసుకునే వెసులుబాటు మాత్రం ఉండదు. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే చిన్న మొత్తంలో కన్వీనియెన్స్ ఫీజును కూడా వసూలు చేస్తారు. యూపీఐ ఆధారిత పేమెంట్స్కు మాత్రం ఎలాంటి అదనపు రుసుము ఉండదు.
Tags :