కేంద్రం కీలక నిర్ణయం... ఢిల్లీలో విమానాల రాకపోకలపై
గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఈ నెల 26వ తేదీన రిపబ్లికన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది. రిపబ్లిక్ డే వేడుకల దృష్ట్యా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలపై ఆరు రోజుల పాటు ఆంక్షలు విధించింది. జనవరి 19 నుంచి 26వ తేదీ వరకూ ఉదయం 10:20 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు విమానాల టేకాఫ్, ల్యాండిరగ్లను నిషేధించింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ వెల్లడిరచింది. 26వ తేదీన ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించే భారీ పరేడ్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో పలు ఆంక్షలను కూడా విధించారు.