రేపటి నుంచి ఏపీలో ముమ్మరంగా వ్యాక్సిన్ ప్రక్రియ
రేపటి నుంచి ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా ప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని పట్టణ పీహెచ్సీల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్కు తగ్గట్టుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రతి పట్టణ పీహెచ్సీ పరిధిలో వార్డు సెక్రెటేరియట్లో వ్యాక్సినేషన్ను ప్రారంభించాలని, సరిపడా వైద్య సిబ్బందిని కూడా అందుబాటులోకి ఉంచుకోవాలని కమిషనర్ ఆదేశించారు. బుధవారమే లబ్ధి దారుల జాబితాను తయారు చేసుకొని, వారందరికీ సమాచారాన్ని చేరవేయాలని ఆరోగ్య శాఖ కమిషనర్ కలెక్టర్లకు సూచించారు. మరోవైపు సీఎం జగన్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, దీనిని ముమ్మరంగా చేపట్టడమే కర్తవ్యమని అధికారులకు ఉద్బోధించారు. తొలుత అర్బన్ ప్రాంతాల్లతో వ్యాక్సినేషన్పై దృష్టి పెడతామని, వార్డు గ్రామ సచివాలయాలు యూనిట్గా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని అధికారులకు జగన్ సూచించారు.