ASBL NSL Infratech

ఏపీలో విజృంభిస్తున్న కరోనా... భారీగా పెరిగిన కేసులు

ఏపీలో విజృంభిస్తున్న కరోనా... భారీగా పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా, 984 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,96,863 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,203కు చేరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 306 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,145 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

                రాష్ట్రవ్యాప్తంగా 1,49,16,201 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరులో 163, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో నాలుగు జిల్లాల్లో వందకుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :