సోనియా గాంధీకి కరోనా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి రన్దీప్ సుర్జేవాలా తెలిపారు. సోనియాకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. సోనియా గాంధీ గత కొన్ని వారాలుగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో ఆమె జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పరీక్షలు చేయించగా పాజిటివ్గా తేలిందన్నారు. వైద్యులు సూచన మేరకు ప్రస్తుతం ఆమె స్వీయ నిర్భందంలో ఉన్నారని వెల్లడించారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉండగా సోనియా కరోనా బారిన పడటం గమనార్హం.
Tags :