హామీల అమలుకు కసరత్తులు ప్రారంభం.. నేతలకు కేసీఆర్ స్పెషల్ ఆర్డర్స్
మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిన సందర్భంగా ప్రగతిభవన్లో పార్టీ నేతలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మునుగోడులో ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలని, అందుకు కావాల్సిన కార్యచరణను ప్రారంభించాలని కేసీఆర్.. పార్టీ నాయకులను ఆదేశించారు. నియోజకవర్గం అధికారులతో సమన్వయం పాటిస్తూ హామీల అమలును చేపట్టాలని తెలిపారు. పార్టీపై నమ్మకంతోనే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రజలు గెలిపించారని సమావేశంలో కేసీఆర్ చెప్పుకొచ్చారు. అనంతరం గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్కు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నియోజకవర్గ ప్రజలకు పారదర్శక పాలన అందించాలని సూచించారు.
Tags :